*ఇంటి ఇంటికి వెళ్లిఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మీచెక్కులు పంపిణీ
చేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్*లబ్దిదారులు ఇంటి ఇంటి కి వెళ్లి చెక్కులు ఇవ్వడానికి మా అన్న వచ్చాడు అని మంగళ హారతి పట్టి బొట్టు పెట్టి అక్క చెల్లలు స్వాగతం పలుకుతున్నారు*
*అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ధ్యేయం*
*సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం*
*చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్*
గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన 7 మంది లబ్దిదారులకు 7,00,812
రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇంటింటికీ వెళ్లి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పని చేస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.
2014 ముందు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పు చేసి పెళ్లి చేసేవారని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడబిడ్డలకు మేనమామగా మారి ఒక్క లక్ష 116 రూపాయలను పేద ప్రజలకు చెక్కుల రూపంలో నేరుగా ఇస్తున్నామని తెలిపారు.
![]() |
ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఆడబిడ్డలకు ఒక భరోసాగా ఉందని అన్నారు.
గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా ఇవ్వలేదని అన్నారు.
భారతదేశంలో ఆడబిడ్డల పెళ్లిళ్ల కొరకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని కరోనా లాంటి సంక్షోభంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంక్షేమానికే పెద్ద పీట వేశారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు గారు అన్నారు.
సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధినాయకత్వంలో పురపాలక మంత్రి కేటీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలతో పేదలను అక్కున చేర్చుకున్న ప్రభుత్వ కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్కటే అన్నారు.
ప్రజలకు కావాలసిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రిక అయిన కళ్యాణలక్షీ పథకం ఆడపిల్లకు ఓ వరం లాంటిదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతమైన పథకం ఉండడం ఎంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో లేకున్నా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రాష్ట్రంలో అమలు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. నేటి పరిస్థితులలో ఆడపిల్ల పెళ్లి చేయడానికి, ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష నూట పదహారు రూపాయలు ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయమన్నారు.
ఈ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వమే అందజేస్తుందని తెలిపారు.
మహిళల రక్షణ కోసం షీ టీం లను ఏర్పాటు చేయడం జరిగింది.
గర్భినీ స్ర్తీల కోసం, పుట్టిన పిల్లలకోసం కేసీఆర్ కిట్టు అందజేయడం జరుగుతుంది.
పల్లెల అభివృద్ధే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు అన్నారు.
పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుందని అన్నారు.
గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంతో మంచినీటిని అందిస్తున్నామని అందని గ్రామాలకు త్వరలో అందిస్తామని అన్నారు.
పల్లెలు పచ్చదనంతో ఉండేందుకు హరితహారం కార్యక్రమం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగింది.
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూటిక తీపించడం జరిగింది.
నూతనంగా ఏర్పడిన గ్రామాలకు గ్రామ పంచాయితీ భవనాలను మంజూరు చేయించడం జరిగింది.
కుల సంఘ భవనాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
దళిత బంధు దేశంలో ఆదర్శంగా నిలుస్తుంది.