Type Here to Get Search Results !

రైతులకు ఇది నిజంగా వరం.. పంటను కాపాడే డివైజ్.. వివరాలివే..!

Nagar Kurnool: వరి పంటకు నిర్ణిత స్థాయి కంటే ఎక్కువ మోతాదులో నీటిని అందిస్తే పంట ద్వారా భయంకరమైన మీథెన్ వాయువు విడుదల అవుతుంది. దీని ద్వారా కాలుష్యం పెరిగి పంట దిగుబడి తగ్గడం, చెదలు పట్టడం వంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి.





వరి పంటకు నిర్ణిత స్థాయి కంటే ఎక్కువ మోతాదులో నీటిని అందిస్తే పంట ద్వారా భయంకరమైన మీథెన్ వాయువు విడుదల అవుతుంది. దీని ద్వారా కాలుష్యం పెరిగి పంట దిగుబడి తగ్గడం, చెదలు పట్టడం వంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి. పంట నష్టంతోపాటు వాతావరణం అధికంగా కాలుష్యం అవుతుంది. కేవలం పంట వేర్లకు మాత్రమే నీరు అందించాల్సి ఉంటుంది. కాండానికి కాదు సాధారణంగా చాలా వరకు వరి పంటలు కాండం వరకు కూడా నీరు నిల్వ ఉంటుంది. దీని వలన పంట ఏపుగా పెరగడం తగ్గిపోయి దిగుబడి కూడా తగ్గుతుంది. అయితే ఇలాంటి నష్టాలనుంచి రైతులు పంటను కాపాడుకునేందుకు స్వామి వివేకానంద రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు చిన్నపాటి పరికరాన్ని కనుగొన్నారు.

ఈ పరికరం ద్వారా వరి పంట నీటిని నిర్ణిత స్థాయి వరకు మాత్రమే నీటిని అందించాలని వివరించారు. ఇందుకుసంబంధించిన వివరాలను ఈ సంస్థ మేనేజర్ గౌస్ మియా అన్ని వివరాలు తెలిపారు. రైతులు పంట పొలాల్లో పైపులాంటి ఈ పరికరాన్ని అమర్చి వాటికి ఉన్నటువంటి రంద్రాల్లో సగభాగం వరకు మాత్రమే నీళ్లు నిలిచేలా చేసుకుంటే పంటకు కావలసినంత నీరు అందుతుందని వివరించారు.

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad